Posts

Showing posts from July, 2017

ప్రభుత్వ వ్యవస్థలపై పనిగట్టుకుని దాడి!!

తెలంగాణా రాష్ట్రం కుదురుకుని ఎదుగుతున్న క్రమంలో ఒక ముఠా పనిగట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తోన్న ప్రతిపనిని తప్పుపట్టడం తో పాటు, దానికి వ్యతిరేకంగా అల్లరి మూకలతో కలిసి ఆందోళనలు చేయడం, అక్కడితో ఆగకుండా కోర్టులకు వెళ్లి స్టే లతో పనులను ఆపేయించడం వంటివి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టులు, పథకాలను అడ్డుకోవడానికే పరిమితమైన వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలను కూడా అడ్డుకునేంతగా దిగజారారు. తాజాగా తెలంగాణా రాష్ట్ర  కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలపై హైదరాబాద్ హైకోర్టు లో నమోదయిన కేసు కూడా ఈ కోవలోకే వస్తుంది. గతంలో మల్లన్నసాగర్, కాళేశ్వరం తదితర ప్రోజెక్టుల విషయంలో కేసులు వేసిన వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ నియామకాల ప్రక్రియకు అడ్డు పుల్లలు వేస్తున్నారు.  కాంట్రక్టు అధ్యాపకులను రెగ్యూలరైజ్ చెయ్యడాని వ్యతికేస్తూ కోర్ట్ కు వెళ్లిన వాళ్ళు, సింగరేణి వారసత్వ ఉద్యాగాలను అడ్డుకున్న వాళ్ళు, పోలీసు రిక్రూట్మెంట్ లో అక్రమాలు జరిగాయని అల్లర్లు చేసిన వాళ్ళే ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో కూడా గోల చేయిస్తున్నారు. దీనికోసం ఈ ముఠా మూడంచెల పద్ధతిని ఎంచుకున్నది. ప్ర